రాజమండ్రికి చెందిన చిరంజీవి తలారీ హశిత శ్రీ ఐశ్వర్య టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడుకు ఈ మేరకు విరాళం డిడిని అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు.