తిరుమల భక్తులతో కిటకిట
NEWS Sep 10,2025 07:58 am
భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల పుణ్య క్షేత్రం. శ్రీవారిని 70 వేల 828 మంది దర్శించుకున్నారు. 26 వేల 296 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.07 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రస్తుతం భక్తులు 19 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి కనీసం 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.