తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Sep 09,2025 07:19 am
తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 77 వేల 117 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 765 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.10 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రస్తుతం భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.