శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.39 కోట్లు
NEWS Sep 08,2025 07:47 am
తిరుమల శ్రీవారిని ఆదివారం 27 వేల 410 మంది భక్తులు దర్శించుకున్నారు. 9 వేల 656 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతోందన్నారు. చంద్రగ్రహణం సందర్బంగా శ్రీవారి ఆలయాన్ని రాత్రి 7 గంటలకు మూసి వేశారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ తర్వాత తిరిగి తెరిచారు.