తిరుమల పుణ్యక్షేత్రం భక్త సందోహం
NEWS Sep 07,2025 10:02 am
భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల. శ్రీవారిని 82 వేల 118 మంది భక్తులు దర్శించుకున్నారు. 32 వేల 118 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.97 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. క్యూ లైన్ కొనసాగుతోందని, టోకెన్లు లేని భక్తులకు 8 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు. ఇవాళ చంద్రగ్రహణం కావడంతో ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు ప్రకటించారు.