రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్లో గణేశ్ లడ్డూ వేలం పాట మరోసారి రికార్డు సృష్టించింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్లో జరిగిన లడ్డూ వేలం పాటలో ఓ భక్తుడు ఏకంగా ₹ 1.87 కోట్లు వెచ్చించి లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో లడ్డూ ధర ₹ 1.87 కోట్లు పలికింది. ఏటా ఇక్కడ దేశంలోనే రికార్డు స్థాయిలో వేలం పాట జరుగుతుంది.