శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు
NEWS Sep 05,2025 09:52 am
తిరుమల క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 59 వేల 834 మంది భక్తులు దర్శించుకున్నారు. 24 వేల 628 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ క్రిష్ణ గెస్ట్ హౌస్ వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.