భద్రాచలం కూనవరం ప్రధాన రహదారిపై గోదావరి వరద నీరు చేరింది. గురువారం మధ్యాహ్నం మురుమూరు ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం నుండి కూనవరం న వెళ్ళే ప్రయాణీకులు జాగ్రత్తలు వహించాలని తెలియజేశారు. గోదావరి ముంపు ఉన్నచోట దాటే ప్రయత్నం చేయవద్దని వాహనదారులకు సూచించారు.