టీటీడీకి రూ.1.01 కోట్లు విరాళం
NEWS Sep 04,2025 05:05 pm
తూర్పు గోదావరి జిల్లా వెలివెన్నుకు చెందిన శశి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మేనేజింగ్ పార్టనర్ రవికుమార్ బురుగుపల్లి అనే భక్తుడు సంస్థ తరపున, గురువారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.01 కోట్లు (రూ. 1,01,11,111) విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బి.ఆర్. నాయుడుకు అందజేశారు.