తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Sep 04,2025 09:21 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 70 వేల 472 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 247 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.85 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం భక్తులు 9 కంపార్టుమెంట్లలో ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 9 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.