ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీపై ఆయన భగ్గుమన్నారు. ఆ పార్టీ దగాకోరు పార్టీ అంటూ మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వం కోసం కాదు కల్వకుంట్ల అస్తిత్వం కోసమే బీఆర్ఎస్ ఉందన్నారు.దోచుకున్న డబ్బును పంచుకోవడంలో తేడాలు రావడంతోనే గొడవలు వచ్చాయన్నారు. లిక్కర్ స్కాంలో ఏ విధంగా కవిత దోచుకుందో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ని మళ్ళీ తెరమీదకు తెచ్చి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని వాపోయారు.