సీబీఐ విచారణ కోసం కేంద్రానికి లేఖ
NEWS Sep 02,2025 09:04 am
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరింది. సీబీఐ అంగీకరిస్తే బిల్లులు, డబ్బు లావాదేవీలపై వివరాలు అందజేస్తామని పేర్కొంది. అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ప్రమేయం ఉన్నందున సీబీఐ దర్యాప్తు జరపాలని నిర్ణయించినట్లు లేఖలో స్పష్టం చేసింది.