సీఎస్ పై హక్కుల కమిషన్ సీరియస్
NEWS Aug 07,2025 05:18 am
తెలంగాణ సీఎస్ రామకృష్ణ రావుకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది మానవ హక్కుల కమిషన్. పోలీసుల నిర్లక్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అనుమతి లేనప్పుడు అక్కడ జనాలను, కార్యక్రమాన్ని ఎందుకు అనుమతించారంటూ ప్రశ్నించింది. తొక్కిసలాట జరుగుతుందని పోలీసులు ఉహించలేరా , వచ్చిన జనాలను, నిర్వాహకులను, నిందితుడిని అనుమతి లేదని హెచ్చరించారా అని నిలదీసింది. ప్రమాదం జరిగే వరకు పోలీసులు ఎందుకు వేచి చూశారంటూ మండిపడింది. ప్రాణాలు కోల్పోయిన రేవతికి రూ. 5 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.