మొక్కలు నాటిన కుమ్మర సంఘం నాయకులు
NEWS Jul 01,2026 09:08 pm
వనజీవి, పద్మశ్రీ దరిపల్లి రామయ్య జయంతి సందర్భంగా పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. టీఆర్కేఎస్ కార్యాలయం, రామాలయం ప్రాంగణంలో కొత్తగూడెం కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ సిరపు సుగుణ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి వనజీవి రామయ్య సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మర సంఘం నాయకులు, సభ్యులు, స్థానికులు పాల్గొని ఆయన ఆశయాలను కొనసాగించాలని సంకల్పించారు.