381 కిడ్నీ మార్పిడి సర్జరీలు సక్సెస్
NEWS Jul 01,2026 09:08 pm
కామారెడ్డి: యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ యూనిట్ ప్రముఖ నెఫ్రాలజిస్టులు డా. రాజశేఖర చక్రవర్తి, డా. విజయ్ వర్మ ఇప్పటివరకు 381 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. రక్త గ్రూపులు వేర్వేరుగా ఉన్న రోగులకు కూడా (ఏబీఓ ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్) విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసి ఆరోగ్యకరమైన జీవితం అందిస్తున్నామని చెప్పారు. అలాగే 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధులను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో చికిత్స పొందాలని ప్రజలకు సూచించారు.