పోచమ్మ మహాలక్ష్మమ్మ సామూహిక వన భోజనాలు
NEWS Aug 07,2025 12:06 am
ఆర్యవైశ్య సంఘం మెట్పల్లి ఆధ్వర్యంలో పోచమ్మ మహాలక్ష్మమ్మ సామూహిక వనభోజనాలను స్థానిక వాసవి గార్డెన్లో నిర్వహించారు. 1500 వరకు ఆర్యవైశ్యులు హాజరయ్యారు. ఉదయం మహాలక్ష్మి దేవాలయానికి వెళ్లి పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు లింబాద్రి, కార్యదర్శి బుడికే శ్రీకాంత్, మెట్పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు, కార్యవర్గం పాల్గొన్నారు.