బీసీల కోసం జాగృతి తరపున అనేక పోరాటాలు నిర్వహించబోతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ అస్తిత్వం, వనరులు, సాంస్కృతిక వైరుధ్య పరిరక్షణ కోసం ఏర్పాటైనదే జాగృతి అని చెప్పారు. తెలంగాణ సమయంలో కేసీఆర్ చెప్పినట్టుగా జాగృతి ముందుకెళ్లిందని తెలిపారు. జయశంకర్ సార్ ఆలోచనలను తు.చ. తప్పకుండా పాటించామని చెప్పారు. జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో ఈరోజు జాగృతి ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.