ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. మహిళలకు ఉచిత ప్రయాణం, నూతన బార్ లైసెన్స్ పాలసీ సహా మొత్తం పది కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 15 నుంచి రాష్ట్రమంతటా ఐదు కేటగిరీల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్త్రీ శక్తి పేరుతో తీసుకువస్తున్న ఈ పథకంపై మంత్రిమండలిలో చర్చ జరుగుతోంది. ఇక, ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.