తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు కూడా తమ పార్టీవైపు చూస్తున్నారని అన్నారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ మొత్తం కేసీఆర్ డైరెక్షన్ లో జరిగిందేనని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.