రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ నెల 10 వరకు డ్రంకెన్ డ్రైవ్, 11 నుంచి 17 వరకు హై స్పీడ్, 18 నుంచి 24 వరకు హెల్మెట్ లేకుండా చేసే ప్రయాణాలపై డ్రైవ్ చేపడతామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి 31 వరకు బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు డీజీపీ.