తాను ఏది మాట్లాడినా మంత్రి పదవి కోసమే అని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్రెడ్డి. నాకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారని ఆరోపించారు. పదవుల కోసం నేను ఎవరి కాళ్లు మొక్కనని, ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు. అవసరమైతే మళ్లీ త్యాగం చేసి ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకొస్తానని చెప్పారు. గతంలో తాను రాజీనామా చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ప్రజల వద్దకు వచ్చిందన్నారు. త్యాగమైనా, పోరాటమైనా మునుగోడు ప్రజల కోసమేనని అన్నారు.