రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల గురించి కీలక ప్రకటన చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు.1.46 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ తో రాష్ట్రంలో ఏ షాపులోనైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్డులు పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటాయన్నారు.