విద్యుత్ సర్దుబాటు పేరుతో ఏపీ సర్కార్ వినియోగదారులపై మోయలేని భారాన్ని మోపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు పెంచబోమంటూ బుకాయిస్తూనే మరో వైపు సర్దుబాటు చేస్తున్నామంటూ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారంటూ ఆరోపించారు. అవి ట్రూ అప్ ఛార్జీలు కాదని, సామాన్యుడిని నడ్డి విరిచే ఛార్జీలంటూ ఫైర్ అయ్యారు. రాబోయే కాలంలో ఇంకెన్ని ప్రజలపై భారం మోపుతారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు .