రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన: జంతర్ మంతర్ వద్ద ధర్నా
NEWS Aug 05,2025 11:38 am
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళుతున్నారు. ఈ మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరుతారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో ఆయన పాల్గొంటారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొననున్నారు.