కాళేశ్వరం దోషులపై చర్యలు తీసుకోవాలి
NEWS Aug 05,2025 09:35 am
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని, ఈ విషయం కమిషన్ తేల్చిందన్నారు. సీబీఐ విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.