నేటి నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళన
NEWS Aug 05,2025 09:24 am
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీపీసీసీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల పాటు ఆందోళన చేపట్టనుంది. మంగళవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.