ధర్మపురి: షాపింగ్ కాంప్లెక్స్ గదులకు వేలం
NEWS Aug 05,2025 10:41 am
ధర్మపురిలోని మార్కెట్ రోడ్డులో నిర్మించిన కేఎన్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ గదులకు సీల్డు టెండర్లు, బహిరంగ వేలం వేయనున్నట్లు శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. కాంప్లెక్స్లోని గదులకు వచ్చేనెల ఒకటి నుంచి 2028 ఆగస్టు 31వరకు మూడేళ్ల కాల పరిమితితో వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 5 నుంచి 18 వరకు ఆన్లైన్ టెండర్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.