అతడు జట్టు కోసం సర్వశక్తులు ధారపోశాడు: గిల్
NEWS Aug 04,2025 08:42 pm
మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లు జట్టులో ఉంటే కెప్టెన్సీ చాలా సులువుగా అనిపిస్తుందని భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రశంసలు కురిపించాడు. టీమిండియా-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ 2-2తో హోరాహోరీగా ముగిసిన అనంతరం గిల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్న గిల్ మాట్లాడుతూ... బౌలర్ల అద్భుత ప్రదర్శనే జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిందని స్పష్టం చేశాడు.