ఏపీలో సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ: సీఎం చంద్రబాబు
NEWS Aug 04,2025 08:30 pm
ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ అమలులోకి రానుంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఈ పాలసీలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే, మద్యం వల్ల పేదల జీవనోపాధికి హాని కలగకుండా చూడాలని తయారీదారులకు సూచించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా ఈ పాలసీ రూపొందనుంది. బార్లలో 10% షాపులను కార్మిక వర్గాలకు కేటాయించనున్నారు. తక్కువ ఆల్కహాల్ శాతంతో మద్యం అమ్మకాల ద్వారా నష్టాలను తగ్గించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు.