గచ్చిబౌలిలో పిడుగు..హడలిపోయిన ప్రజలు
NEWS Aug 04,2025 08:23 pm
హైదరాబాద్ మహానగరంలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం ఒక్కసారిగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన గచ్చిబౌలిలో భారీ శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.వివరాల్లోకి వెళితే, గచ్చిబౌలి పరిధిలోని ఖాజాగూడ ల్యాంకో హిల్స్ సర్కిల్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. అక్కడ ఉన్న హెచ్పీ పెట్రోల్ బంకుకు ఎదురుగా ఉన్న ఓ తాటిచెట్టుపై ఉరుములతో కూడిన వర్షం మధ్యలో ఒక్కసారిగా పిడుగు పడింది.