ఫుట్పాత్పై నిరసన తెలిపిన టీసీఎస్ ఉద్యోగి: జీతం ఆలస్యంపై ఆందోళన
NEWS Aug 04,2025 07:57 pm
పూణేలో టీసీఎస్ ఉద్యోగి సౌరభ్ మోరె, జీతం ఆలస్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, కంపెనీ బయట ఫుట్పాత్పై నిరసనకు దిగాడు. జీతం రాక తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిని వివరిస్తూ లేఖ రాశాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా, టీసీఎస్ స్పందిస్తూ, ఉద్యోగి గైర్హాజరు కారణంగా జీతం నిలిపివేయబడిందని, ప్రస్తుతం వసతి కల్పించి సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపింది.