కాళేశ్వరం అక్రమాలకు కేసీఆర్ బాధ్యుడు
NEWS Aug 04,2025 06:12 pm
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు, అక్రమాల పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ను కేబినెట్ ముందుంచారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి . ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక సారాంశాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లానింగ్ నుంచి నిర్మాణం, బ్యారేజ్ ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వరకు జరిగిన అన్నింటికి మాజీ సీఎం కేసీఆర్ బాధ్యుడని పేర్కొన్నారు. కేసీఆర్ తో పాటు ఆనాటి మంత్రి హరీశ్ రావు కూడా భాగం ఉందని ఆరోపించారు.