బీసీ రిజర్వేషన్ల కోసం 6న కాంగ్రెస్ ధర్నా
NEWS Aug 04,2025 03:45 pm
బీసీ రిజర్వేషన్ల అమలు గురించి ఈ నెల 6న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ ధర్నాలో పాల్గొనడానికి ప్రత్యేక రైలులో కాంగ్రెస్ కార్యకర్తలను తరలించనున్నారు. ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీకి బయలు దేరనుంది ఈ స్పెషల్ ట్రైన్. కార్యకర్తలతో కలిసి నాగపూర్ వరకు ప్రయాణించనున్నారు కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్.