తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు
NEWS Aug 04,2025 03:19 pm
తిరుమలలోని శ్రీవారిని 82 వేల 628 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇటీవలి కాలంలో ఇదే అత్యధిక సంఖ్య . స్వామి వారికి 30 వేల 339 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.25 కోట్లు వచ్చిందని ఈవో శ్యామల రావు వెల్లడించారు. ప్రస్తుతం దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.