యాదగిరిగుట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
NEWS Feb 20,2026 02:35 pm
యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవ దేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. స్వామి వారి ప్రధానాలయం లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు నిత్యపూజ కైంకర్యాల అనంతరం మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలను వైభవంగా నిర్వహించారు. స్వామివారిని అభిషేకించి మత్స్యావతారుడిగా అలంకరించి ఆస్థానం చేశారు. 4 వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, దివ్యప్రబంధ ప్రాశుర పఠనాలను కనుల పండువగా చేపట్టారు.