AP ప్రభుత్వం భారీ ముందడుగు
NEWS Feb 20,2026 07:06 pm
APని AI, క్వాంటం టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్గా నిలిపేందుకు AP ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. భవిష్యత్ సాంకేతికతను అందిపుచ్చుకుని, యువతకు ఉజ్వల అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యం పెట్టుకుంది. భాగంగా ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరిగిన INDIA-AI ఇంపాక్ట్ సమ్మిట్ - 2026లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. IBM, IIT మద్రాస్ వంటి సంస్థలతో 7 కీలక అవగాహన MOUలు కుదుర్చుకున్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేసి, దానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ఈ ఒప్పందాల ఉద్దేశం.