కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై మండిపడింది సుప్రీంకోర్టు. చైనాతో ఘర్షణపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని 2022లో ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ.ఈక్రమంలో 2 వేల చదరపు.కి.మీ ప్రాంతాన్ని చైనా ఆక్రమించిందని మీకెలా తెలుసు అని రాహుల్ గాంధీని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. మీ వద్ద విశ్వసనీయమైన ఆధారం ఉందా.. మీరు నిజమైన భారతీయులైతే ఇలా మాట్లాడరంటూ పేర్కొంది.