శిబూ సోరెన్ మృతి: పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
NEWS Aug 04,2025 12:49 pm
జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్ ఢిల్లీలోని సర్గంగా రామ్ ఆస్పత్రిలో కిడ్నీ సమస్యలతో మరణించారు. ఆయన మృతిపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. శిబూ సోరెన్ మాజీ కేంద్ర మంత్రిగా, ఆదివాసీ హక్కులు, జార్ఖండ్ స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణం పట్ల లోక్సభ, రాజ్యసభలు సంతాపం వ్యక్తం చేసి, స్పీకర్ ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు. ఈ మరణం జార్ఖండ్ రాజకీయాల్లో, సీఎం హేమంత్ సోరెన్ కుటుంబంలో విషాదం నింపింది.