శిబూ సోరెన్ మరణం: జార్ఖండ్ ఉద్యమం తెలంగాణకు స్ఫూర్తి అని కేసీఆర్ సంతాపం
NEWS Aug 04,2025 11:55 am
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. జార్ఖండ్ స్వరాష్ట్ర ఉద్యమం తెలంగాణకు స్ఫూర్తిదాయకమని, ఆదివాసీ హక్కులు, ప్రాంతీయ అస్తిత్వం కోసం శిబూ సోరెన్ చేసిన పోరాటం తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడిందని అన్నారు. 2001లో టీఆర్ఎస్ స్థాపన సమయంలో శిబూ సోరెన్ను తొలి సభకు ఆహ్వానించినట్లు, తెలంగాణ ఉద్యమానికి ఆయన సంపూర్ణ సంఘీభావం అందించారని కేసీఆర్ గుర్తు చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారని, 2022లో జార్ఖండ్లో కలిసి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. శిబూ సోరెన్ ఆత్మకు శాంతి, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.