శిబూ సోరెన్ మరణం: కేటీఆర్ సంతాపం
NEWS Aug 04,2025 11:44 am
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గిరిజన హక్కులు, ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారం కోసం పోరాడిన శిబూ సోరెన్ మరణం ఒక శకానికి ముగింపును సూచిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన సంఘీభావం, కేసీఆర్తో సహకారం కీలకమైన బలాన్ని ఇచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. శిబూ సోరెన్ దార్శనికత, విలువలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని, హేమంత్ సోరెన్ కుటుంబానికి సంతాపం తెలిపారు.