ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్తో హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి భేటీ
NEWS Aug 04,2025 11:40 am
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్లో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలతో సమావేశమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదిక, ఎమ్మెల్యే కవిత జగదీష్ రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యత సంతరించుకుంది. కవిత లిల్లిపుట్ అంటూ జగదీష్పై చేసిన వ్యాఖ్యలు, కాళేశ్వరం నివేదికపై హరీష్ రావుతో చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలపై కూడా కేసీఆర్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు.