యెమన్ తీరంలో ఆఫ్రికన్ వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడి 68 మంది మరణించారు. 74 మంది గల్లంతయ్యారని ఐక్యరాజ్యసమితి వలస సంస్థ తెలిపింది. 154 మంది ఇథియోపియన్ వలసదారులతో ఉన్న ఈ పడవలో కేవలం 12 మంది మాత్రమే బయటపడ్డారు. 54 మంది మృతదేహాలు ఖన్ఫర్ జిల్లా తీరంలో లభ్యమయ్యాయి. బలమైన అలల కారణంగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కష్టతరంగా సాగుతున్నాయి.