దేశంలో కొలువు తీరిన మోదీ సర్కార్ నిర్వాకం కారణంగా భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ . కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఎస్సీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ మహా పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి ఒక్కరు పరిరక్షణ కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు.