క్వారీ ప్రమాద ఘటనపై సిఎం విచారం
NEWS Aug 03,2025 05:31 pm
బాపట్ల జిల్లా బల్లికురవ క్వారీలో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో పాటు మరి కొంత మంది తీవ్రంగా గాయపడిన ఘటనపై సిఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్వారీలో పనులు చేస్తున్న కార్మికులపై రాళ్లు పడడంతో నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంపై సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఫోన్ లో మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు.