డ్రగ్స్‘డేంజర్’: హీరో కృష్ణసాయి పోరాటం
NEWS Aug 03,2025 12:55 pm
సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు హీరో కృష్ణసాయి డ్రగ్స్పై పోరాటం చేస్తున్నారు. ‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు?’ అనే సందేశంతో రూపొందిన ప్రచార చిత్రాలు, పాటలకు గవర్నర్లు, పోలీసు అధికారుల నుంచి ప్రశంసలు వచ్చాయి. డ్రగ్స్పై అవగాహన కల్పించేందుకు ‘డేంజర్’ సినిమాను తీస్తున్నారు. సినిమా యువతను సానుకూలంగా మారుస్తుందని కృష్ణసాయి నమ్మకం వ్యక్తం చేశారు. అప్పటి గవర్నర్లు తమిళసై, దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీజీపీ జితేందర్, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఇంటెలిజెన్స్ ఐజి సుమతి, అదనపు డీజీపీ జిహెచ్పి రాజు, నార్కోటిక్ బ్యూరో చీఫ్ అదనపు డిజిపి సందీప్ శాండిల్య ఈ డ్రగ్స్ పాటను వీక్షించి కృష్ణసాయిని అభినందించారు.