గొర్రెల స్కాంలో మ్యూల్ ఖాతాలపై ఈడీ నజర్
NEWS Aug 03,2025 12:21 pm
గొర్రెల స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. 200 మ్యూల్ ఖాతాలపై దృష్టి సారించింది. ఒక్కో ఖాతాలో రూ.5 కోట్ల వరకు డిపాజిట్ అయినట్లు ఆధారాలు సేకరించింది. అప్పటి ఉన్నతాధికారుల పాత్రపై ఆరా తీస్తోంది. జూలై 30న జరిపిన సోదాలలో మ్యూల్ ఖాతాలు , ఏటీఎం కార్డులు, 31 మొబైల్ ఫోన్స్ , 20కి పైగా సిమ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకుంది. డబ్బులు ఎవరెవరికి వెళ్లాయి..? బ్యాంకు ఖాతాదారులు ఎవరు..? తదితర అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేసింది.