ఓవల్ టెస్ట్: గిల్ ఔట్, జైస్వాల్ సెంచరీతో భారత్ ఆధిక్యం
NEWS Aug 02,2025 07:25 pm
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు బలమైన స్థితిలో ఉంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 104* పరుగులతో సెంచరీ సాధించగా, కెప్టెన్ శుభ్మన్ గిల్ 11 పరుగుల వద్ద ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ చేసిన ఆకాష్, కరుణ్ (17) కూడా వికెట్లు కోల్పోయారు. ప్రస్తుతం 55 ఓవర్లలో 5 వికెట్లతో 234 పరుగులు చేసిన భారత్, 211 పరుగుల ఆధిక్యంలో ఉంది. జైస్వాల్, జడేజా క్రీజులో కొనసాగుతున్నారు.