ఏపీలో కీలక సమీక్ష: జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చ
NEWS Aug 02,2025 07:19 pm
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర అధికారులతో కీలక సమీక్ష జరిగింది. రాష్ట్రంలో రూ. 5,233 కోట్ల విలువైన రహదారి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలపై చర్చించారు. మరిన్ని ప్రాజెక్టులకు నిధులు, అనుమతుల కోసం చంద్రబాబు కోరగా, గడ్కరీ సానుకూలంగా స్పందించారు.