రైతుల ఖాతాల్లోకి రూ.7000: ‘అన్నదాత సుఖీభవ’కు చంద్రబాబు శ్రీకారం
NEWS Aug 02,2025 06:59 pm
ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీని నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేసింది. సూపర్ సిక్స్ పథకాలలో అత్యంత ముఖ్యమైన ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ప్రకాశం జిల్లా, దర్శి మండలం, వీరాయపాలెం గ్రామంలో పచ్చని పొలాల మధ్య రైతన్నలతో కలిసి ఆయన ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,85,838 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి తొలి విడతగా రూ.7,000 చొప్పున నేరుగా జమ చేశారు.