కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి - కోర్టు
NEWS Aug 02,2025 06:25 pm
మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు సీరియస్ అయ్యింది. ఆమెపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో ఈ నెల 21లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేసింది. నటి సమంత వ్యవహారంలో కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు కొండా సురేఖ.